విజయవాడ, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): ప్రకాశం బ్యారేజ్కి కృష్ణమ్మ పరవళ్లు రోజురోజుకు పెరుగుతున్నాయి. మరో రెండు రోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం బ్యారేజ్కు ఇన్ఫ్లో 5లక్షల క్యూసెక్కులకు చేరుకుంది.మంగళవారం రాత్రి బ్యారేజ్లోని 70 గేట్లను ఆరు అడుగుల ఎత్తు వరకు ఎత్తగా... బుధవారం ఉదయం మరో నాలుగు అడుగులకు పెంచారు. ప్రస్తుతం పది అడుగల మేర ఎత్తుకు గేట్లను ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజ్ నుంచి 5 లక్షల క్యూసెక్కుల"/>