నిర్మానుష్యం

కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ఉధృతి నేపథ్యంలో ప్రభుత్వం చేపట్టిన కర్ఫ్యూ విధింపు జిల్లాలో సంపూర్ణంగా అమలైంది. మధ్యాహ్నం 12 నుంచి పోలీసు, రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులు వీధుల్లోకి వచ్చి దుకాణాలు మూసివేయించడం, ప్రైవేటు వాహనాలను ఆపడం, బైక్‌లపై వెళ్లే వారిని సైతం హెచ్చరించడంతో పట్టణ ప్రాంతాల్లో జనసంచారం తగ్గిపోయింది. రోడ్డుపై ఉండే చిరువ్యాపారాలు కూడా నిలిచిపోయాయి.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి