Flash News / గవర్నర్ తీసుకోబోయే నిర్ణయంపై ఉత్కంఠ - Darsi Live News

Flash News /  గవర్నర్ తీసుకోబోయే నిర్ణయంపై ఉత్కంఠ - Darsi Live News

గవర్నర్ తీసుకోబోయే నిర్ణయంపై ఉత్కంఠ 

ప్రభుత్వ నిర్ణయంపై టీడీపీ విమర్శలు ◆ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల బిల్లులను రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వద్దకు పంపించింది. ఈ బిల్లులను గవర్నర్ ఆమోదిస్తే కనుక మూడు రాజధానుల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే విషయంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. మరోవైపు, ప్రభుత్వ నిర్ణయంపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఓవైపు కరోనా కేసులు అమాంతం పెరిగిపోతుంటే... రాజధానుల విషయం ఇప్పుడు అవసరమా? అని ప్రశ్నిస్తున్నాయి.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి