AP News : రాష్టంలో కర్ఫ్యూ జూన్ 20 వరకు పొడిగింపు.. కర్ఫ్యూ సడలింపులు ఇవే..

AP News : రాష్టంలో కర్ఫ్యూ జూన్ 20 వరకు పొడిగింపు.. కర్ఫ్యూ సడలింపులు ఇవే..

ఏప్రిల్, మే నెలల్లో రోజుకు 20 వేలకు పైనే కేసులు రావడంతో రాష్ట్రంలో కర్ఫ్యూ విధించడం జరిగింది. ఇప్పుడు కరోనా కేసులు రోజుకు 10 వేలు దిగువన నమోదు అవుతూ ఉండటంతో కర్ఫ్యూ సడలింపులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
 

ఆంధ్రప్రదేశ్ లో కర్ఫ్యూ పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల అనగా జూన్‌ 20 వరకు కర్ఫ్యూను పొడిగించింది జగన్ సర్కార్. జూన్‌ 10 తర్వాత ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు ఉంటుందని అలాగే ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఉదయం 8 గంటలనుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే తెరవబడి ఉంటాయని పేర్కొన్నారు. మధ్యాహ్నం 2 నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ యధాతధంగా ఉంటుందని చెప్పడం జరిగింది.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి