కురిచేడు :కుక్కను ఢీకొట్టిన బైక్.. మహిళ మృతి..

కురిచేడు :కుక్కను ఢీకొట్టిన బైక్.. మహిళ మృతి..

కుక్క అడ్డురావడంతో బైక్‌ అదుపు తప్పి కిందపడి ఓ మహిళ మృతి చెందిన ఘటన కురిచేడు మండలంలోని పడమరవీరాయపాలెంలో జరిగింది. గ్రామానికి చెందిన తోట నాగలక్ష్మి (30) ద్విచక్రవాహనంపై తన భర్తతో కలసి దర్శిలో ఓ వివాహానికి హాజరయ్యేందుకు ఆదివారం రాత్రి బయలుదేరారు.
 

కురిచేడు దర్శి రోడ్డులో బస్‌షెల్టర్‌ సమీపంలో వారి ద్విచక్రవాహనానికి కుక్క అడ్డుగా వచ్చింది. దీంతో ద్విచక్రవాహనం కుక్కకు తగిలడంతో వారు కిందపడ్డారు. ఈ ప్రమాదంలో నాగలక్ష్మి తల రోడ్డుకు తగిలింది. బలమైన గాయం కావడంతో ఆమెను కురిచేడులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు.
 

అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కురిచేడులో కుక్కల బెడద ఎక్కువగా ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. ఇప్పటికే కుక్కలు ద్విచక్రవాహనాలకు తగిలి ముగ్గురు మృతి చెందడం గమనార్హం.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి