ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి - Darsi Live News

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి - Darsi Live News

అతి తక్కువ ధరలో Computers ఆమ్మబడును సెల్ : +91 9700046190

అనంతపురం : అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాప్తాడు మండలంలో 44 నేషనల్‌ హైవేపై గొల్లపల్లి దగ్గర ఓ కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢకొీట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి పరిస్థితి కూడా విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ప్రమాద సమయంలో కారు కొంత ఎత్తు పల్టీలు కొట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రమాదంలో చనిపోయినవారిని బుక్కరాయసముద్రం మండలం సిద్ధ రాంపురం గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. వీరు బెంగళూరు నుంచి అనంతపురం వస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదానికి కారణం ఏంటి? డ్రైవర్‌ నిర్లక్ష్యమా? అతి వేగమా? ప్రమాదవశాత్తూ జరిగిందా? అన్నది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి