శివంగిలా దూకి బిడ్డను కాపాడుకున్న తల్లి - Darsi Live News

 

న్యూఢిల్లీ: కిడ్నాపర్ల బారి నాలుగేళ్ల తన పాపను కాపాడుకునేందుకు శివాంగిలా దూకింది. కిడ్నాపర్లే భయంతో బైక్‌ వదిలేసి పారిపోయేలా చేసింది. ఈ ఘటన ఢిల్లీలో జరిగింది. ఇద్దరు వ్యక్తులు నల్ల పల్సర్‌ బైక్‌పై ఆ తల్లి ఇంటివద్దకు వచ్చారు. ఒక గ్లాస్‌ మంచినీళ్లు కావాలని అడిగారు. ఆమె మంచినీళ్లు ఇచ్చే లోపు ఆమె కూతురు నాలుగేళ్ల పాపను బలవంతంగా బండిపైకి ఎక్కించారు. పాప ఏడ్వడంతో బయటకు పరిగెత్తుకుంటూ వచ్చిన ఆ తల్లి తన రక్షణను కూడా పట్టింటచుకోకుండా బైక్‌కు అడ్డంగా నిలబడింది. తన పిల్లను లాగేసుకుంది. ఒక చేత్తో బిడ్డను గట్టిగా పట్టుకుంటూనే మరో చెత్తో గట్టిగా బైక్‌ను పట్టుకుని ఆపేసింది. దీంతో చేసేది లేక కిడ్నాపర్లు బైక్‌ను, తమ వెంట తెచ్చుకున్న బ్యాగ్‌ను వదిలేసి పారిపోయారు. విషయం తెలుసుకున్న బైక్‌ను, బ్యాగ్‌ను స్వాధీనం చేసుకొని విచారణ మొదలుపెట్టారు. ఆ బ్యాగ్‌లో నాటు తుపాకితోపాటు కొన్ని తూటాలు కూడా ఉన్నాయి. బైక్‌ యాజమని ధీరజ్‌ను పట్టుకొని విచారించగా ఆ పాప బాబాయినే కిడ్నాప్‌కు ప్లాన్‌ చేసినట్లు చెప్పాడు. వస్త్ర వ్యాపారంలో బాగా సంపాదించిన తన అన్న నుండి 35 లక్షలు వసూలు చేసేందుకే పాప కిడ్నాప్‌కు ప్లాన్‌ చేసినట్లు చెప్పాడు. కిడ్నాప్‌కు పాల్పడిన ఆ ఇద్దరి సమాచారం ఇంకా దొరకలేదు

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి