తెలంగాణలో ఎంసెట్‌ సహా ప్రవేశ పరీక్షలన్నీ వాయిదా...Darsi Live News

తెలంగాణలో ఎంసెట్‌ సహా ప్రవేశ పరీక్షలన్నీ వాయిదా...Darsi Live News

హైదరాబాద్‌ : తెలంగాణలో అన్ని ప్రవేశ పరీక్షలనూ వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రవేశ పరీక్షలన్నీ వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జులై 1 నుంచి 15వ తేది వరకూ కామన్‌ ఎంట్రెన్స్‌ పరీక్షలను నిర్వహించాలని ఉన్నత విద్యామండలి షెడ్యూల్‌ను ఖరారు చేసింది. కాగా.. ప్రభుత్వ నిర్ణయంతో పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు ప్రవేశ పరీక్షలన్నీ వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి