Flash News / రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా మళ్లీ రమేశ్‌కుమార్‌ - Darsi Live News

Flash News / రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా మళ్లీ రమేశ్‌కుమార్‌ - Darsi Live News

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా మళ్లీ రమేశ్‌కుమార్‌

అర్ధరాత్రి ఉత్తర్వులిచ్చిన ప్రభుత్వం

సుప్రీం తుది తీర్పునకు లోబడేనని స్పష్టీకరణ

అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను పునర్నియమిస్తూ ప్రభుత్వం గురువారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఆయనను తిరిగి నియమిస్తున్నట్లు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ పేరుతో ప్రకటన జారీ చేశారు. ఈ మేరకు రాజపత్రం (గెజిట్‌) విడుదల చేయాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు ఇచ్చారు. సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌లో వచ్చే తుది తీర్పునకు లోబడి పదవీ పునరుద్ధరణ నోటిఫికేషన్‌ ఉంటుందని పేర్కొన్నారు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి