ప్రకాశం జిల్లాలో విషాదం: కల్తీ సారా తాగి 8 మంది మృతి - Darsi Live News

ప్రకాశం జిల్లాలో విషాదం: కల్తీ సారా తాగి 8 మంది మృతి - Darsi Live News

ప్రకాశం జిల్లాలో విషాదం: కల్తీ సారా తాగి 8 మంది మృతి - Darsi Live News


ప్రకాశం : ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కురిచేడులో శానిటైజర్‌ కలిసిన కల్తీ సారా తాగిన ఘటనలో మృతుల సంఖ్య 8కి చేరుకుంది. వారిలో నలుగురు గురువారం మరణించారు. చికిత్స పొందుతూ ఇవాళ మరో నలుగురు చనిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఎంత మంది కల్తీసారా తాగారు? ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? అనే దానిపై విచారిస్తున్నారు. ఐతే గ్రామంలో చాలా మంది కల్తీసారా తాగరని మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని స్థానికులు చెబుతున్నారు. ఐతే అగ్రహారం ప్రాంతం నుంచి గ్రామంలోకి కల్తీసారా వచ్చినట్లు గుర్తించారు. అక్కడి నుంచి కురిచేడుతో పాటు చుట్టు పక్కల ప్రాంతాలకు కూడా సరఫరా అయినట్లు భావిస్తున్నారు. విచారణలో మరిన్ని వివరాలు బయటపడే అవకాశముంది.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి