శానిటైజర్‌ తాగి తొమ్మిది మంది మృతి - Darsi Live News

శానిటైజర్‌ తాగి తొమ్మిది మంది మృతి - Darsi Live News
శానిటైజర్‌ తాగి తొమ్మిది మంది మృతి - Darsi Live News

కురిచేడు : చేతులు శుభ్రం చేసుకునే శానిటైజర్‌ను తాగిన ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య తొమ్మదికి చేరింది. ప్రకాశం జిల్లా కురిచేడు మండల కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక అమ్మవారి ఆలయం వద్ద ఉండే ఇద్దరు యాచకులు మద్యానికి బానిసలై కొన్ని రోజులుగా శానిటైజర్లు తాగుతున్నట్లు గ్రామస్థులు తెలిపారు. గురువారం రాత్రి కడుపులో తీవ్ర మంటతో ఓ వ్యక్తి చనిపోయాడు. మరో వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో కొట్టుకుంటుండగా స్థానికులు 108కు సమాచారం అందించారు. సిబ్బంది వచ్చి అతనిని దర్శి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. ఇదే విధంగా కురిచేడులోని పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో నివాసం ఉండే కడియం రమణయ్య(28) గురువారం ఉదయం శానిటైజర్‌, నాటు సారా కలిపి తాగుతుండగా స్థానికులు గుర్తించి వారించారు. అయినప్పటికీ ఆయన తాగి ఇంటికి వెళ్లిపోయాడు. రాత్రి అపస్మారక స్థితిలో పడి ఉన్న రమణయ్యను కుటుంబసభ్యులు గుర్తించి 108కు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి దర్శి ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు గుర్తించారు. కురిచేడులో శానిటైజర్‌ తాగి అస్వస్థతకు గురైన వారిలో ఇవాళ ఉదయం మరో ఆరుగురు మృతి చెందారు. మృతులు అనుగొండ శ్రీను (25), భోగెమ్‌ తిరుపతయ్య(37), గుంటక రామిరెడ్డి(60, రమణయ్య(65) రమణయ్య(65), రాజారెడ్డి(65), బాబు(40), ఛార్లెస్‌ (45), అగస్టీన్‌(47)గా గుర్తించారు. కరోనా నేపథ్యంలో గత 10 రోజులుగా మద్యం దుకాణాలు తెరుచుకోక పోవడంతో యాచకులు, స్థానికులు శానిటైజర్‌ తాగారని గ్రామస్థులు తెలిపారు. కరోనా కేసులు పెరగడంతో కురిచేడు ప్రాంతంలో లాక్‌డౌన్‌ విధించారు. దీంతో మద్యం దొరక్క పలువురు శానిటైజర్‌కు అలవాటుపడుతున్నారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నాం: ఎస్పీ కురిచేడు ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని ప్రకశాం జిల్లా ఎస్పీ సిద్దార్థ కౌశల్‌ తెలిపారు. ‘‘పోలీసు బృందాలు ఘటనాస్థలిని పరిశీలించాయి. 10 రోజులుగా శానిటైజర్‌ తాగుతున్నట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. చుట్టు ప్రక్కల విక్రయిస్తున్న శానిటైజర్స్‌ను సీజ్‌ చేసి పరీక్షలకు పంపిస్తాం. శానిటైజర్‌ నేరుగా తాగారా, వేరే ద్రవంతో కలిపి తాగారా? అనేది పరిశీలించాల్సి ఉంది’’ అని ఎస్పీ తెలిపారు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి