కందుకూరు : వ్యభిచార ముఠాకు బాలికను అమ్మేసిన వదిన - Darsi Live News

కందుకూరులో దారుణమైన సంఘటన...! వ్యభిచార ముఠాకు బాలికను అమ్మేసిన వదిన..! చిత్రహింసలు పెడుతూ వ్యభిచారం చేయిస్తున్న ముఠా...! బాలికలను వ్యభిచారంలోకి దించిన ముఠాపై కేసులు నమోదు...! కందుకూరు పట్టణం లోబాలికను నిర్బంధించి బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్న ముఠా గుట్టును కందుకూరు పోలీసులు రట్టు చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. సీఐ విజయ్ కుమార్ తెలిపిన మేరకు.. నెల్లూరు జిల్లా కావలి పట్టణ సమీపంలోని ముసునూరు ప్రాంతానికి చెందిన ఓ బాలిక రెండేళ్ల క్రితం పదోతరగతి చదువుతూ మధ్యలో ఆపేసింది. ఆమె తండ్రికి రెండు వివాహాలు కాగా రెండో భార్య కూతురే ఈ బాలిక. తల్లిదండ్రుల మధ్య మనస్పర్థలు రావడంతో అప్పటినుంచి బాలిక తన అన్న, వదినల వద్ద ఆశ్రయం పొందుతోంది. ఆమెకు రక్షణ కల్పించాల్సిన వదిన సింగ రాయకొండకు చెందిన వ్యభిచార ముఠా వద్ద కొంత నగదు తీసుకుని వారికి అమ్మేసింది దీంతో ఆ ముఠా నాయకురాలు కందుకూరు-సింగరాయకొండ రోడ్డులోని ఓ గ్రానైట్ ఫ్యాక్టరీ సమీపంలో ఇల్లు అద్దెకు తీసుకుని బాలికను అందులో నిర్బంధించి వ్యభిచారం చేయించసాగింది. ఈ క్రమంలో బాధితురాలు డయల్ 100కు సమాచారం అందించడంతో కందుకూరు పోలీసులు ఈ నెల 18వ తేదీ శనివారం రాత్రి రెస్క్యూ నిర్వహించి ఆ బాలి కను రక్షించారు. ఆదివారం పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో ఆమెకు వైద్య పరీక్షలు చేసి సోమవారం డిశ్చార్జి చేశారు. బాలిక పట్ల అమానుషంగా ప్రవర్తించిన వ్యభిచార ముఠా నాయకురాలు కె.మాధవి, ఆమె సహాయకుడు శ్రీకాంత్, బాలిక వదిన జ్యోతి, ఇల్లు అద్దెకు ఇచ్చిన ఆర్. నరసింహారావు పై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ఈ కేసును దిశ పోలీస్ స్టేషన్ డీఎస్పీ ధనుంజయులు విచారిస్తున్నట్లు తెలిపారు. కాగా డీఎస్పీ సోమవారం స్థానిక ఏరియా ఆసుపత్రిలో బాలికను పరామర్శించారు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి