పెట్రోల్‌ ధరలు తాజాగా నేడు పెట్రోలుపై ... Darsi Live News

పెట్రోల్‌ ధరలు తాజాగా నేడు పెట్రోలుపై ... Darsi Live News

పెట్రోల్‌ ధరలు తాజాగా నేడు పెట్రోలుపై ... Darsi Live News
న్యూఢిల్లీ : పెట్రోల్‌ ధరలు కరోనా వైరస్‌తో పోటీ పడుతున్నాయి. ఇంధన ధరల పెరుగుదలకు అడ్డుకట్ట పడడం లేదు. వరుసగా పదకొండు రోజుల నుండి కేంద్రం పెట్రోల్‌ ధరలను పెంచుతోంది. తాజాగా నేడు పెట్రోలుపై 55 పైసలు, డీజిల్‌పై 60 పైసలు పెరిగాయి. తాజా పెరుగుదలతో గత 11 రోజుల్లో పెట్రోలుపై రూ.6.02 పైసలు, డీజిల్‌పై రూ. 6.40 పెరిగింది. దీంతో హైదరాబాద్‌లోనూ లీటర్‌ పెట్రోల్‌ ధరలు రూ. 80 దాటి రూ. 80.22కు చేరుకోగా, డీజిల్‌ధర 74.07కు చేరింది. ఎపి రాజధాని అమరావతిలో లీటరు పెట్రోలు ధర హైదరాబాద్‌ కంటే ఎక్కువగా రూ.80.66గా ఉండగా, డీజిల్‌ ధర రూ. 74.54గా ఉంది. ఇక, ఢిల్లీలో పెట్రోలు, డీజిల్‌ ధరలు వరుసగా రూ. 77.28, రూ.75.79గా నమోదు కాగా, చెన్నైలో రూ. 80.86, రూ.73.69కి పెరిగాయి. ముంబయిలో పెట్రోల్‌ ధర రూ.84.15 కాగా, డీజిల్‌ ధర రూ. 74.32కి చేరింది. కరోనా లాక్‌డౌన్‌తో కుదేలవుతున్న ప్రజలపై పెట్రోల్‌ ధరల పెరుగుదల మరింత భారం కానుంది.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి