ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం మరో 99 మందికి కరోనా...! DARSI LIVE NEWS

ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం మరో 99 మందికి కరోనా...! DARSI LIVE NEWS

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం మరో 99 మందికి కరోనా సోకింది. ఇందులో రాష్ట్రంలో ఉన్న 44 మంది, విదేశాల నుంచి వచ్చిన 45 మంది ఉన్నారు. దీంతో మొత్తం రాష్ట్రంలో కొవిడ్‌ కేసుల సంఖ్య 2,896కి చేరింది. ఈ కేసుల్లో విదేశాల నుంచి వచ్చిన 63, ఇతర రాష్ట్రాలకు చెందిన 153 మంది ఉన్నారు. గడిచిన 24 గంటల్లో 10,240 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి వరకూ 56 మంది మృతి చెందినట్లు పేర్కొంది. సోమవారం నమోదైన కొత్త కేసుల్లో కోయంబేడు నుంచి వచ్చిన వారు ఏడుగురు ఉన్నారు. వారిలో చిత్తూరు జిల్లాలో అయిదుగురు, నెల్లూరు జిల్లావారు ఇద్దరు ఉన్నారు. విదేశాల నుంచి వచ్చి కొత్తగా కరోనా సోకిన 45 మందిలో కువైట్‌ నుంచి వచ్చిన వారు 41 మంది, ఖతార్‌ నుంచి ముగ్గురు, సౌదీ అరేబియా నుంచి వచ్చిన వారు ఒక్కరు ఉన్నారు. వివిధ జిల్లాలకు చెందిన 41 మంది కొవిడ్‌ నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. దీంతో రాష్ట్రంలో వ్యాధి నుంచి బయటపడ్డ వారి సంఖ్య 1,848కి చేరింది. మరో 947 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో విదేశాల నుంచి వచ్చిన 63 మంది, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి కరోనా బారిన పడ్డ 117 మంది ఉన్నారు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి