ఎపిలో 477 కరోనా కేసులు.. ఐదుగురి మృతి... Darsi Live News

ఎపిలో 477 కరోనా కేసులు.. ఐదుగురి మృతి... Darsi Live News

అమరావతి : ఎపిలో కరోనా రోజురోజుకి ఉధృతమౌతోంది. గడిచిన 24 గంటల్లో 24,451 మంది నమూనాలు పరీక్షించగా 477 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ ప్రకటించింది. 439 కేసులు ఎపికి చెందనవి కాగా, 34 కేసులు పొరుగు దేశాలు, ఇతర రాష్ట్రాల నుండి వచ్చినవారివని తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,929కి చేరింది. కరోనా కారణంగా కృష్ణా జిల్లాలో ముగ్గురు, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో ఒక్కరు చొప్పున మరణించారని, దీంతో మొత్తం మృతుల సంఖ్య 106కి చేరినట్లు తెలిపింది. 4,516 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా, 4,307 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి