అమరావతి: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని చంద్రబాబు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మన నేలకు స్వాతంత్య్ర ఫలాలు అందించడానికి ఎందరో మహానుభావులు తమ జీవితాలను త్యాగం చేశారని పవన్ తెలిపారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు కూడా దేశ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.