స్వాతంత్య్రం.. మహనీయుల త్యాగఫలం

  • ప్రజలకు బాబు, పవన్‌ శుభాకాంక్షలు
అమరావతి: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని చంద్రబాబు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మన నేలకు స్వాతంత్య్ర ఫలాలు అందించడానికి ఎందరో మహానుభావులు తమ జీవితాలను త్యాగం చేశారని పవన్‌ తెలిపారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు కూడా దేశ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి