వైసీపీ నేతలది పైశాచిక ఆనందం: డొక్కా

అమరావతి: చంద్రబాబు నివాసం నీట మునిగిందని అసత్య ప్రచారం చేస్తూ వైసీపీ నాయకులు పైశాచిక ఆనందం పొందుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌ ధ్వజమెత్తారు. రాజకీయ ప్రయోజనం కోసం ప్రజల ప్రాణాలను ఫణంగా పెట్టేందుకు ప్రయత్నిస్తూ దాన్ని చంద్రబాబుపైకి నెట్టేయడం దుర్మార్గమని విరుచుకుపడ్డారు. పోలవరం రివర్స్‌ టెండరింగ్‌ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి పీపీఏ మొట్టికాయలు వేయడంతో ప్రజల దృష్టిని మళ్లించేందుకు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబును ఆ ఇంటి నుంచి ఎలాగైనా పంపించేయాలని తపిస్తున్నారే తప్ప ప్రజలను కాపాడడంపై శ్రద్ధ చూపారా అని నిలదీశారు. ఆ దుష్పచారమే వారికి యమపాశం కాబోతోందని హెచ్చరించారు. వరదలపై ముందస్తు చర్యల గురించి సీఎం గానీ, ఆ శాఖ మంత్రి గానీ సమీక్షించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ముంపు గ్రామాల ప్రజలను కాపాడడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందన్నారు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి