జాతీయ జెండాను ఎగురవేసిన సీఎం జగన్‌

విజయవాడ: ఇందిరాగాంధీ స్టేడియంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి జగన్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకల్లో డీజీపీ గౌతం సవాంగ్, సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం, మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి