మిల్లర్ల మాయాజాలం

రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి. మిల్లర్ల అడ్డగోలు దందాకు అధికారుల సహకారం తోడు కావడంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అయోమయం నెలకొంది. కొనే అవకాశం ఉన్నా అవసరమైనన్ని గోతాలు, తరలించడానికి లారీలు లేకపోవడంతో పొదుపుసంఘాల మహిళలు ఏం చేయలేకపోతున్నారు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి